అరేయ్ ఏం పనిరా:   లస్సీలో టాయిలెట్ పోశాడని ఆందోళన.. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాల్టీలో ఘటన

అరేయ్ ఏం పనిరా:   లస్సీలో టాయిలెట్ పోశాడని ఆందోళన.. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాల్టీలో ఘటన

నర్సాపూర్, వెలుగు: లస్సీలో టాయిలెట్  పోసి అమ్మినట్లు ప్రచారం జరగడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. మెదక్  జిల్లా నర్సాపూర్  మున్సిపాలిటీలోని హైవేను ఆనుకొని ఉన్న ఏ1 జ్యూస్‌‌  సెంటర్‌‌‌‌లో ఓ బాలుడు శుక్రవారం గ్లాసులో మూత్రం పోస్తుండగా గమనించిన స్థానికులు నిలదీసి, ఆందోళన చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకొని లస్సీ సెంటర్  యజమాని, బాలుడిని స్టేషన్‌‌కు తరలించారు. ఈ విషయం సోషల్  మీడియాలో వైరల్  అయింది. బాలుడు గ్లాసులో మూత్రం పోసిన మాట వాస్తవమేనని, లస్సీలో కలపలేదని ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపారు.